దొంగ బంగారం అమ్ముతూ వ్యక్తి అరెస్ట్
విజయనగరం: వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి పెద్ద మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన ప్రసాద్ జిల్లా వ్యాప్తంగా పలు చోరీలకు పాల్పడ్డాడు. దొంగతనం చేసిన బంగారాన్ని అమ్ముతుండగా.. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దొంగ బంగారం అని తెలిసి కూడా నిందితుడి నుంచి బంగారం కొనుగోలు చేయడానికి యత్నించిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.