ఆగస్టు 1 నుంచి బెంగళూరులో ‘సూర్య-నాట్యకళా’ ఫెస్టివల్

ఆగస్టు 1 నుంచి బెంగళూరులో ‘సూర్య-నాట్యకళా’ ఫెస్టివల్


సాక్షి, బెంగళూరు : నగరానికి చెందిన సూర్య ఇండియా, నాట్యకళా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు ఒకటి నుంచి నగరంలో ‘సూర్య-నాట్యకళా’ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు నాట్యకళా సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇందిరానగరలోని ఈస్ట్ కల్చరల్ అసోషియేషన్(ఈసీఏ)లో ఈ నృత్యోత్సవాలను నిర్వహించనున్నట్లు సూర్య ఇండియా ప్రతినిధి, ప్రముఖ నృత్యకారిణి సూర్య క్రిష్ణమూర్తి తెలిపారు. ‘దీర్ఘచతురం’, ‘నృత్యాంజలి’, ‘ద్రౌపది’ అనే నృత్య రూపకాలను ఈ నృత్యోత్సవాల్లో ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో నాట్యకళ సంస్థ ప్రతినిధి, నృత్యకారిణి డాక్టర్ శోభా కూడా తన నాట్య ప్రదర్శనను ఇవ్వనున్నారని వెల్లడించారు.   

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top