సింగరేణిలో ఉద్యోగాలంటూ మోసం
పెద్దపల్లి: సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అయిదుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి సింగరేణి బొగ్గు గనుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మభ్యపెడుతున్నారు. సుమారు 100 నుంచి రూ. 1.19 కోట్లు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు వలవేసి నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి స్టాంపు పేపర్లు, ప్రామిసరీ నోట్లను గోదావరిఖని వన్టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.