విధి నిర్వహణలో కానిస్టేబుల్ మృతి


వైఎస్సార్ కడప జిల్లా: విధి నిర్వహణలో గుండెపోటుకు గురై ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. అటవీ శాఖకు చెందిన టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ హనుమంతు శుక్రవారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు.

 

బాలుపల్లి అటవీ రేంజ్‌లో కూంబింగ్ నిర్వహణకు వెళ్లి 9 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసు అమరవీరుల దినోత్సవం రోజునే విధి నిర్వహణలో కానిస్టేబుల్ హనుమంతు గుండెపోటుతో మృతిచెందడంతో అధికారులు, తోటి కానిస్టేబుల్ సంతాపం తెలిపారు. కానిస్టేబుల్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

 

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top