పాముకాటుకు రైతు మృతి
టేకులపల్లి(ఖమ్మం): పొలం వద్ద పని చేసుకుంటున్న రైతన్న పాము కాటుకు బలై మృతిచెందాడు. ఖమ్మ జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామానికి చెందిన చిల్లా మాధవరావు(40) పొలం పని చేస్తుండగా.. పాము కాటుకు గురయ్యాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.