కందులకు ధర రాలేదని.. రైతు ఆత్మహత్య


దౌల్తాబాద్‌: ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు ధర రాలేదని మనస్తాపానికి గురైన ఓ కందిరైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలం సూరయపల్లిలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన బిచ్చయ్య(52) కందిపంట సాగు చేశాడు. పండిన పంటను అమ్మడానికి యత్నించగా సరైన ధర రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన బిచ్చయ్య పొలంలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top