యువ రైతు ఆత్మహత్య


రాయపోలు: అప్పుల బాధ తాళలేక ఓ యువరైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మెదక్‌ జిల్లా రాయపోలు మండలం టెంకంపేటలో శనివారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన మైసని గోపాల్‌(29) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పలు పెరిగిపోవడంతో పాటు పంట దిగుబడి సరిగ్గా లేకపోవడంతో.. మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున​ సమయంలో ఇంట్లో ఉరి వేసుకొని మృతిచెందాడు. 

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top