అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామానికి చెందిన హళావత్ వెంకన్న(55) అనే రైతు అప్పుల బాధతో బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. వెంకన్న దాదాపు రూ. 6 లక్షలు అప్పు చేసి పంట పెట్టాడు. అయితే నష్టం రావడంతో అప్పులు తీర్చే మార్గం కనపడక మనస్థాపంతో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.