కరీంనగర్‌లో బాంబుల కలకలం

కరీంనగర్‌లో బాంబుల కలకలం

కరీంనగర్: జిల్లా కేంద్రంలో మంగళవారం బాంబుల కలకలం రేగింది. కరీంనగర్ నడిబొడ్డులోని జ్యోతినగర్‌లో గల ఓ గ్రౌండ్‌లో మంగళవారం ఉదయం మున్సిపాలిటీ సిబ్బందికి చెత్తతీసే సమయంలో రెండు గ్రెనేడ్లు కనిపించాయి. ఈ విషయాన్నిసిబ్బంది పోలీసులకు తెలియజేశారు. సంఘటనాస్థలానికి బాంబ్ స్క్వాడ్‌తో చేరుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించి రెండు గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఏమైనా పేలుడు పదార్ధాలు ఉన్నాయా అనే అనుమానంతో ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top