రామసముద్రంలో ఏనుగు బీభత్సం


- రైతు మృతి

రామసముద్రం(చిత్తూరు)


చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం పరిధిలో ఓ ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. పంటలను నష్ట పరచడంతో పాటు రైతులపై దాడి చేస్తోంది. ఈ ఏనుగు బారిన పడి సోమవారం వెంకటరమణ అనే రైతు మృతిచెందాడు. ఏనుగును తిరిగి అడవుల్లోకి తరిమేందుకు అటవీశాఖ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు ఏనుగును తరిమికొట్టడానికి యత్నిస్తున్న సమయంలో అది తిరగబడి వెంకటరమణను తొక్కి చంపిందని అధికారులు తెలిపారు.



 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top