ఫుల్ట్యాంక్ నింపారా... పేలిపోద్ది
చెన్నై : వాహనాలలో ఫుల్ట్యాంక్ పెట్రోలు నింపొద్దంటూ ఆయిల్ కంపెనీ హెచ్చరించింది. వేసవి కాలం కావడంతో ఎండలు అధికమయ్యాయి. చెన్నై సహా పలు నగరాల్లో వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా వున్నాయి. నగరంలో లక్షలాది సంఖ్య లో ద్విచక్ర వాహనాలు ఉన్నాయి.
ఉద్యోగ విధులకు వెళ్లేవారు తరచుగా పెట్రోలు నింపుకోవడం కష్టతరం కావడంతో ఫుల్ట్యాంక్ పెట్రోల్ నింపుకుంటూ వుంటారు. మరి కొన్ని చోట్ల ఫుల్ ట్యాంకు పెట్రోలు నింపుకోవడానికి ప్రత్యేక ఆఫర్ల ఇస్తున్నారు. అయిత చాలా వాహనాలు మండుటెండలోనే పార్కు చేస్తూ ఉంటారు. ఎండలో నిలిపే వాహనాల్లో ఫుల్ ట్యాంక్ పెట్రోలు వున్నట్లయితే తీవ్రమైన ఎండ వేడిమి కారణంగా ట్యాంక్ పేలిపోవడానికి, మంటలు రావడానికి అవకాశం ఉంది.
ఫుల్ ట్యాంక్ పెట్రోలు నింపడానికి బదులు హాఫ్ ట్యాంకు, లేదా ముప్పావు ట్యాంకు నింపుకోవాలంటూ ఆయిల్ కంపెనీ వాహనదారులకు సూచించింది. చెన్నైలో ఎగ్మూరు రైల్వే స్టేషన్, అనేక వాణిజ్య సముదాయాల్లో పార్కింగ్ అంతా బహిరంగ ప్రదేశంలోనే ఉంటుంది. నీడలో ఉండే వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఆయిల్ కంపెనీ పేర్కొంది.