బాసరకు పోటెత్తిన భక్తులు
బాసర: బాసరలో కొలువైన శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిట లాడుతోంది. నేటి నుంచి మూడు రోజులపాటు సరస్వతి అమ్మవారి పంచమి వేడుకలు ప్రారంభం కానున్నాయి. దీంతో భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. భక్తుల రద్దీ దష్ట్యా తగిన ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు.