గడ్కరీతో ఫడణ్‌వీస్ భేటీ


న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి దేవేంద్ర ఫడణ్‌వీస్ గురువారం ఢిల్లీలోని అతని స్వగృహంలో కలిశారు. బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఆయన గడ్కరీతోపాటు పలువురు పార్టీ సీనియర్ నాయకులను కలిసేందుకు ఢిల్లీ వచ్చారు. ఈ సందర్భంగా గడ్కరీ, ఫడణ్‌వీస్‌లు రాష్ట్ర రాజకీయాలపై చర్చించుకున్నారని తెలిసింది. అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలను సైతం ఫడణ్‌వీస్ కలిసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, శుక్రవారం ఫడణ్‌వీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రధాని, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రతిపక్షాల నాయకులు సుమారు 40 వేల మంది కార్యకర్తలు హాజరు కానున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top