డబ్బులు ఇవ్వలేదని బ్యాంకుకు తాళం


మల్యాల: బ్యాంకులో డబ్బులు ఇవ్వటం లేదని ఆగ్రహిస్తూ ఖాతాదారులు బ్యాంకును మూసివేసి నిరసన తెలిపారు. కరీంనగర్ జిల్లా మల్యాలలోని యూబీఐ బ్యాంకు శాఖ వద్దకు డబ్బుల కోసం బుధవారం ఉదయం పెద్ద సంఖ్యలో వినియోగదారులు చేరుకున్నారు. ఎంతసేపటికీ బ్యాంకు అధికారులు డబ్బులు ఇవ్వలేదు. దీంతో విసుగు చెందిన జనం బ్యాంకు తలుపులు మూసివేసి ఆందోళన తెలిపారు. అరగంట తర్వాత మేనేజర్ వచ్చి సర్దిచెప్పటంతో నిరసనను విరమించారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top