సామాజిక న్యాయ సాధనే సీపీఎం లక్ష్యం

సామాజిక న్యాయ సాధనే సీపీఎం లక్ష్యం - Sakshi


సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం



గణపురం: తెలంగాణలో సామాజిక న్యాయం సాధిం చడమే సీపీఎం లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.  మహాజన పాదయాత్ర జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో శనివారం మూడోరోజు కొనసాగింది. తమ్మినేని మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌లో కూర్చుని తాను అబద్దాల కోరనడం విడ్డూరమని, ప్రజల్లోకి వస్తే ఎవరు అబద్ధా్దలకోరో తేలుతుందన్నారు.



హరీశ్, సీఎం కేసీఆర్‌లే అబద్ధాలకోరులని ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాలు, శాసన సభ జరిగిన తీరు,  సంక్షేమ పథకాల గురించి చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, దీనికోసం పాదయాత్రను మధ్యలో వదిలైనా వస్తానని చెప్పారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top