విదేశాల్లోని నల్లధనం తేలేక..
వరంగల్: విదేశాల్లోని నల్లధనం తీసుకురాలేక ప్రధాని పెద్ద నోట్లను రద్దు చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. విజయ్ మాల్యాలా బ్లాక్ మనీ ఉన్నవాళ్లు దర్జాగా తిరుగుతున్నారు.. సామాన్యులు మాత్రం ఇబ్బంది పడుతున్నారన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసి రూ. 2 వేల నోట్లను ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఆదానీ, అంబానీల ప్రయోజనాల కోసమే పెద్ద నోట్ల రద్దు చేశారని ఆయన మండిపడ్డారు.
సంబంధిత వార్తలు