బీజేపీ, టీడీపీలపై పవన్ అసంతృప్తి!

బీజేపీ, టీడీపీలపై పవన్ అసంతృప్తి! - Sakshi


విజయవాడ : బీజేపీ, టీడీపీ ప్రభుత్వ విధానాలపై సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారని సీపీఐ నేత రామకృష్ణ చెప్పారు. విజయవాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్తో భేటీపై వివరణ ఇచ్చారు. (చదవండి : పవన్‌తో సీపీఐ నేతల కీలక భేటీ )



రాజకీయ పొత్తుల కోసం పవన్తో భేటీ కాలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు ఏకం కావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. ఏపీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై గురువారం పవన్ కల్యాణ్తో సీపీఐ నేతలు చర్చించిన విషయం తెలిసిందే.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top