కేసీఆర్ కొత్త వర్గాలను మోసం చేస్తున్నారు: ఉత్తమ్
నల్లగొండ: ఎన్నికలకు మందు టీఆర్ఎస్ పార్టీ చేసిన వాగ్దానాలను పక్కన పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కొత్త వర్గాలను మాయమాటలతో మోసం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీని గాలికి వదిలేశారు. గిరిజన తండాలను పంచాయతీలుగా మారుస్తామని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని అన్నారు.