టీడీపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ
విజయవాడ: కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహ్మద్ జానీ టీడీపీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన శనివారం ఉదయం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జానీకి చంద్రబాబు పచ్చ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, జానీ మద్దతు దారులు పాల్గొన్నారు. కాగా, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు అనంతపురం జిల్లా నాయకులతో చంద్రబాబు సాయంత్రం సమావేశం కానున్నారు.