‘రాజకీయ దిగజారుడుతనం పెరిగింది’
సూర్యాపేట: టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతి, రాజకీయ దిగజారుడుతనం పెరిగిపోయిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆయన శుక్రవారం ఇక్కడ మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. ఈ సర్కార్ పాలనలో నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని.. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.