ప్రిన్సిపల్‌ వేధింపులు: ఉద్యోగి ఆత్మహత్యాయత్నం


ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం తాళ్ళమాడలోని గురుకులంలో ఓ ఉద్యోగిని ఆత్మహత్యకు యత్నించింది. సునీత అనే మహిళ గురుకులంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నది. అయితే ఆమెను ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న రమేష్‌ మూడు నెలలుగా వేధిస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను సత్తుపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top