హాస్య నటుడి భార్య మృతి
టీనగర్: చెట్టును కారు ఢీకొనడంతో హాస్య నటుని భార్య మృతిచెందింది. మదురై తనక్కన్కుళం రెండో వీధి, ఆంజనేయర్ నగర్కు చెందిన మదురై ముత్తు. ఇతని భార్య లేగా అలియాస్ వయ్యమ్మాల్ (32). ఇతను టీవీ సీరియల్స్లో హాస్యనటునిగా వున్నారు. గురువారం ఉదయం శివగంగై జిల్లా, పిళ్లయార్పట్టిలోగల కర్పగ వినాయగర్ ఆలయానికి స్వామి దర్శనం చేసుకునేందుకు లేగా సొంతకారులో వెళ్లారు. కారును తేని జిల్లా చిన్నమనూర్కు చెందిన కన్నన్ (35) నడిపాడు.
తిరుపత్తూరు సమీపాన కొట్టేయిరుప్పు ప్రాంతంలో వస్తుండగా హఠాత్తుగా కారు ముందు టైరు పేలిపోయింది. డ్రైవర్ అదుపు తప్పిన కారు రోడ్డు పక్కనున్న చింతచెట్టును ఢీకొంది. దీంతో కారు ముందు భాగం ధ్వంసమైంది. ముందు సీటులో కూర్చున్న లేగా అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన కన్నన్ తిరుపత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. అనంతరం మెరుగైన చికిత్సల కోసం మదురైకు తీసుకువెళ్లారు. దీనిగురించి తిరుపత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.