యాదాద్రి పనులు పరిశీలించిన సీఎమ్వో కార్యదర్శి
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధి పనులను శనివారం సీఎమ్వో కార్యదర్శి భూపాల్రెడ్డి పరిశీలించారు. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆర్కిటెక్ ఆనంద్సాయి, జేసీ రవినాయక్, ఆలయ ఈవో గీతారెడ్డి ఉన్నారు.