పోలవరంపై సీఎం సమీక్ష
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వర్చువల్ ఇన్స్పెక్షన్ ద్వారా పనులు జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. గత ఏడాది డిసెంబర్ 19 నుంచి ఈ ఏడాది జనవరి 22వ తేదీ వరకు 11.70 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు స్పిల్వే తవ్వకం పనులు సాగగా లక్ష్యంలో 9.30 లక్షల క్యూబిక్ మీటర్ల మేర వెనుకబాటు ఉంది. ఇదే సమయంలో 36.34 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూర్తయిన స్పిల్ వే చానల్ తవ్వకం పనులు జరగగా 5.66 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకం పనుల్లో ఆలస్యం జరిగాయి.
సంక్రాంతి పండుగ సందర్భంగా కార్మికులు అందుబాటులో లేకపోవడంతో పనుల్లో లక్ష్యాన్ని పూర్తి చేయలేక పోయామని అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు వివరణ ఇచ్చారు. డిసెంబర్ 19 నుంచి ఇప్పటివరకు 8.37 లక్షల క్యూబిక్ మీటర్ల మేర లెఫ్ట్ ఫ్లాంక్, 4.48 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు అప్రోచ్ చానల్, 1.86 లక్షల పైలట్ చానల్ తవ్వకం పనులు పూర్తి అయ్యాయి. ఈ నెలలో 850 క్యూబిక్ మీటర్ల వరకు స్పిల్వే కాంక్రీట్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. సమీక్ష మధ్యలో పోలవరం డంప్ యార్డు విషయమై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ భాస్కర్తో సీఎం ఫోన్లో మాట్లాడి ఈ వివాదాన్ని సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
సంబంధిత వార్తలు