ఖమ్మం జిల్లాలో ఇరువర్గాల ఘర్షణ..


చించుపల్లి : ఖమ్మం జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చించుపల్లి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామవరంలో  ఆదివారం ఉదయం ఒక వర్గం వారు ఇనుపరాడ్లతో మరో వర్గంపై దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. కిరణ్ పాసీ అనే వ్యక్తి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top