మాజీ సర‍్పంచ్‌, సర‍్పంచ్‌ ఆత‍్మహత్యాయత‍్నం


చొప‍్పదండి : కరీంనగర్‌ జిల్లా చొప‍్పదండి గ్రామ మాజీ సర‍్పంచ్‌ వెంకటరమణారెడ్డి మంగళవారం మధ్యాహ‍్నం ఆత‍్మహత్యాయత‍్నం చేశారు. గ్రామ వీఏవోలు అక్రమ కేసులు పెట‍్టడంవల‍్ల మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత‍్మహత్యాయత‍్నం చేశారు. గమనించిన కుటుంబసభ‍్యులు కరీంనగర్‌ ఆస‍్పత్రికి తరలించారు. అలాగే చొప‍్పదండి మండలం వెదురుగట‍్ట గ్రామ సర‍్పంచ్‌ ప్రభాకర్‌ కూడా మంగళవారం పురుగుల మందు తాగి ఆత‍్మహత్యాయత‍్నం చేశారు. గమనించిన కుటుంబసభ‍్యులు కరీంనగర్‌ ఆస‍్పత్రికి తరలించారు.

 

గ్రామంలో ఐకేపీకి చెందిన వీవోఏలపై విచారణ సందర్భంగా వీవోఏలు ఇటీవల తమపై అక్రమ కేసులు పెట్టారని మాజీ సర‍్పంచ్‌, సర‍్పంచ్‌ ఆరోపించారు. ఈ సందర‍్భంగా విచారణ చేస్తున‍్న సహకార అధికారి నంబయ‍్య వెనుతిరిగారు. అవినీతి అక్రమాలకు పాల‍్పడుతున‍్న ముగ్గురు వీవోఏలను తొలగించాలని మాజీ సర‍్పంచ్‌, సర‍్పంచ్‌ ఇద‍్దరూ గత కొంత కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. సర‍్పంచ్‌, మాజీ సర‍్పంచ్‌ ఇద‍్దరూ కరీంనగర్‌ ఆస‍్పత్రిలో కోలుకుంటున్నారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top