ప్రభుత్వంపై సమర భేరి: చాడ


భీమదేవరపల్లి: ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దశలవారీగా ఆందోళనలను నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్క నూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడా రు. తెలంగాణ ఉద్యమకారులను పక్కన బెట్టి తెలంగాణద్రోహులకు పెద్ద పీట వేసిన కేసీఆర్‌ అవకాశవాద రాజకీ యాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ, ఎమ్మె ల్యేలతోపాటు ఇతర పార్టీలకు చెందిన నాయ కులకే సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకో వచ్చన్నారు.



ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ‘గడపగడపకు సీపీఐ’కార్యక్ర మాన్ని శుక్రవారం నుంచి(ఈ నెల 10 నుంచి) మార్చి 10వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  ప్రజా సమస్యలను తెలుసుకు నేందుకు ఏప్రిల్, మేల్లో బస్సుయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top