మానకొండూరులో కార్డెన్ సెర్చ్
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని మానకొండూరులో సోమవారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన తనఖీల్లో 200 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని 24 ద్విచక్రవాహనాలు, 13 ఆటోలు, అక్రమంగా నిల్వచేసిన రెండు క్వింటాళ్ల రేషన్ బియ్యం, పెద్ద ఎత్తున గుట్కాప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికే తనిఖీలు నిర్వహిస్తున్నామని సీపీ తెలిపారు.