గోదావరి ఖనిలో కార్డన్‌సెర్చ్‌


గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మండలం ఇందిరానగర్‌లో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 13 బైక్‌లు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 60 లీటర్ల కిరోసిన్‌, క్వింటా బొగ్గును సీజ్‌ చేశారు. ఈ తనిఖీల్లో ఒక సీఐ, నలుగురు ఎస్‌ఐలు, 50 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top