తిరుమల: బ్లాక్లో బ్రేక్ దర్శనం టికెట్లు
- దళారి అరెస్టు
తిరుమల: తిరుమలలో బ్లాక్లో దర్శన టికెట్లను అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తిరువళ్లూరుకు చెందిన భక్తులకు అధిక మొత్తానికి రెండు వీఐపీ టికెట్లను బ్లాక్లో అమ్ముతున్న ఓ వ్యక్తిని సోమవారం ఉదయం విజిలెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాళహస్తికి చెందిన రవికిరణ్ తిరుమలలో దళారీగా పని చేస్తూ శ్రీవారి దర్శన టికెట్లను బ్లాక్లో అమ్మేవాడు. సోమవారం ఉదయం రెండు వీఐపీ టికెట్లను రూ.11,400 లకు విక్రయిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.