సాయినగర్ ఎక్స్ప్రెస్లో సాంకేతిక లోపం
వరంగల్: షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న ఎక్సైప్రెస్లో సాంకేతిక లోపం తలెత్తడంతో.. శుక్రవారం వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. బ్రేక్ జాం అవడం వల్ల రైలు భోగీల్లో ఒక్కసారిగా పొగలు కమ్ముకున్నాయి. ఇది గుర్తించిన డ్రైవర్ అధికారులకు సమాచారం అందించి నెక్కొండ రైల్వే స్టేషన్లో రైలును నిలిపివేశాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న సిబ్బంది అరగంట పాటు మరమ్మతులు నిర్వహించి లోపాన్ని సరిచేశారు.