నేరాల నిరోధానికి బ్లూకోల్ట్స్‌: కమిషనర్‌


భువనగిరి: నేరాల నియంత్రణ కోసం శ్రమించే పోలీసుల కోసం బ్లూ కోల్ట్ వాహనాలను సమకూర్చినట్లు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన భువనగిరి క్యాంపు (హెడ్ క్వార్టర్) ఆఫీస్‌లో 25 బ్లూ కోల్ట్ వాహనాలను ప్రారంభించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ కోసం పోలీస్‌ సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటారని చెప్పారు. డయల్-100కు ఫోన్ చేస్తే పోలీస్‌ సిబ్బంది తక్షణం హాజరై సమస్యలు పరిష్కరిస్తారని సీపీ వివరించారు. ఈ వాహనాలు భువనగిరి రూరల్, టౌన్ ఏరియాల్లో వినియోగించుకోవాలని సూచించారు. అంతకుమునుపు ఆయన వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఫైళ్ల రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top