బీజేపీ మమ్మల్ని అవమానించింది
మహారాష్ట్రలో మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు బీజేపీ సిద్ధమవుతున్న నేపథ్యంలో... ఆ పార్టీ మాజీ భాగస్వామి శివసేన మాత్రం మండిపడుతోంది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకుంది. బీజేపీ తమను తరచు అవమానిస్తూనే ఉందని, తమ ఎమ్మెల్యేలను ఏమాత్రం కలుపుకొని వెళ్లేలా ప్రవర్తించలేదని పార్టీ ఎంపీ వినాయక్ రౌత్ అన్నారు.
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమై బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అసలు తమకు ఏమాత్రం గౌరవం ఇవ్వలేదనే శివసేన ఎమ్మెల్యేలు భావిస్తున్నారని, అలాంటప్పుడు తామెందుకు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని వినాయక్ రౌత్ ప్రశ్నించారు. అయితే, తాము ప్రతిపక్షంలో కూర్చుంటామా.. లేదా ఏదీ కాక విడిగా ఉంటామా అన్న విషయంపై స్పందించేదుకు మాత్రం రౌత్ నిరాకరించారు.