బీరు లారీ బోల్తా




బెంగళూరు :


తుమకూరు తాలూకా, నందిహళ్లి జాతీయ రహదారిలో బీరు లారీ బోల్తాపడింది. వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి కారును ఢీకొనడంతో ఈ  ఘటన చోటు చేసుకుంది. దీంతో పెద్ద ఎత్తున బీరు బాటిళ్లు పగిలి భారీగా నష్టం  చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా స్థానికులతో పాటు అదే రహదారిలో వెళ్లే ద్విచక్ర వాహనదారులు వాహనాలు నిలిపి బాటిళ్లను పట్టుకుపోవడం కనిపించింది.





ఈ సంఘటనతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. క్యాత్సంద్ర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top