నిరుద్యోగ భృతిపై కేబినేట్ సబ్కమిటీ భేటీ
అమరావతి : నిరుద్యోగ భృతిపై కేబినెట్ సబ్ కమిటీ బుధవారం భేటీ అయింది. ఈ కార్యక్రమానికి మంత్రులు లోకేష్, యనమల, అచ్చెన్న, కొల్లు రవీంద్ర హాజరయ్యారు. నెలరోజుల్లోగా నిరుద్యోగ భృతి విధి విధానాలు ఖరారు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. నిరుద్యోగ భృతికి ఎస్సీ, బీసీ సబ్ ప్లాన్ నిధుల కేటాయింపు పరిశీలన జరుగుతోందన్నారు. పల్స్ సర్వే, ఉపాధి కల్పన కార్యాలయాల నుంచి వివరాలు సేకరించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. లబ్ధిదారుల వివరాల సేకరణకు ప్రత్యేకంగా బ్యూరో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నిరుద్యోగ భృతి అమలవుతున్న రాష్ట్రాల అనుభవాలను పరిగణలోకి తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.