'ప్రత్యేక హోదాకు పరిమితులున్నాయి'
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు రాజ్యాంగపరమైన పరిమితులున్నాయని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ సిద్ధార్థ్నాథ్ సింగ్ చెప్పారు. ఢిల్లీలో బుధవారం ఆయన మాట్లాడుతూ....ఏపీకి హోదా అంశంపై వివరణ ఇచ్చారు.
ప్రత్యేక హోదా కోసం 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేయలేదని సిద్ధార్థ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. బీజేపీని విమర్శిస్తున్నా వారు కూడా ఆ సిఫారసును అంగీకరించారని...కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చురకలంటించారు. విభజన చట్టంలోని అన్ని హామీలను అమలుచేస్తామన్నారు. కేంద్రం నిధులను 32 నుంచి 42 శాతానికి తమ పార్టీయే పెంచిందని సిద్ధార్థ్నాథ్ సింగ్ తెలిపారు.
ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రయోజనాలతో సమానమైన సాయాన్ని అందించడంపై చర్యలు చేపట్టామన్నారు. త్వరలోనే దీనికి సంబంధించి ఒక ప్రకటన వెలువడుతుందని చెప్పారు. ప్రత్యేక హోదా వల్ల ఏం ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించడాన్ని పవన్కల్యాణ్ విమర్శించడంపై సిద్ధార్థ్నాథ్ సింగ్ స్పందిస్తూ.. పవన్ బీజేపీని విమర్శించాడని అనుకోవట్లేదన్నారు.
సంబంధిత వార్తలు