చంద్రబాబుకు భద్రత పెంపు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు భద్రతను పెంచారు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ పోలీసులకు హెచ్చరికలు చేసింది. సీఎం సెక్యూరిటీ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని ఏపీ పోలీసులకు ఆదేశాలందాయి. దీనిపై తీసుకున్న చర్యల్లో భాగంగా చంద్రబాబుకు ఇపుడున్న మూడంచెల భద్రతను ఐదంచెలకు పెంచారు. అదనంగా మరో ఎన్ఎస్జీ బృందాన్ని కూడా కేటాయించారు.
సంబంధిత వార్తలు