రేపు చెన్నై రానున్న ఐశ్వర్యరాయ్

రేపు చెన్నై రానున్న ఐశ్వర్యరాయ్ - Sakshi


కొరుక్కుపేట: 53వ ఎడిషన్ ఎఫ్ బీబీ ఫెమినా మిస్‌ఇండియా-2016 పోటీలను ప్రకటించారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా 18 నగరా ల్లో అందాల పోటీలకు బాలికలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ఆయా నగరాల్లో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మాజీ ప్రపంచ సుందరి, ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ ఈ నెల 2వ తేదీ న చెన్నైకు రానున్నారు. డిసెంబర్ 2వ తేదీన స్థానిక రాయపేటలోని ఎక్స్‌ప్రెస్ అవెన్యూ మాల్‌లోని ఈ-హోటల్‌లో జరిగే ఎఫ్ బీబీ ఫెమినా మిస్ ఇండియా 2016 చెన్నై ఎడిషన్ కార్యక్రమానికి నటి ఐశ్వర్యరాయ్ హాజరుకాన్నారు. నగరానికి చెందిన అందాల బాలికలు అందాల పోటీ ల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్నారు.


ఈ నెల 2న జరుగు పోటీలో 18 నుంచి 25 ఏళ్ల (డిసెంబర్ 31 -2016 నాటికి 25 ఏళ్ల)లోపు అమ్మాయిలు పాల్గొనవచ్చునని అన్నారు. అదేవిధంగా పెళ్లి కాని అమ్మాయిలుమాత్రమే ఈ పోటీలకు అర్హులు అని తెలిపారు. ఆసక్తిగల అందమైన అమ్మాయిలు వెంటనే తమ ఫొటోలతో పేర్లునమోదు చేసుకోవాలని కోరారు. www.missindia.in ద్వారా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఫొటోలను missindiaorganization @gmail. com   ద్వారా పంపించాల్సిఉంటుందని తెలిపారు. గ్రాండ్ ఫైనల్స్ వచ్చేఏడాది ఏప్రిల్‌లో ముంబాయి వేదికగా ఉంటాయని వివరించారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top