ఏసీబీకి చిక్కిన వీఆర్వో


కురిచేడు: పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వడానికి ఓ రైతు నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్వోను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడు, గంగదొనకొండ రెవెన్యూ గ్రామానికి వీఆర్వోగా పని చేస్తున్న చెన్న కృష్ణయ్య అదే గ్రామానికి చెందిన ఓ రైతు పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వడానికి లంచం డిమాండ్‌ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన అధికారులు రూ. 4 వేలు లంచం తీసుకుంటుండగా.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదనపు వివరాల కోసం అతనిని విచారణ చేపడుతున్నారు. 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top