కానిస్టేబుల్ అత్యుత్సాహం...


కారేపల్లి: కల్తీ మద్యం తయారు చేస్తున్న వారిని తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడటంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఆ సమయంలో ఆటోను నడుపుతున్నది పోలీస్ కానిస్టేబుల్ కావటం గమనార్హం. వివరాలివీ.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పోలీసులు సోమవారం ఉదయం రేలకాయలపల్లి జైత్రాం తండా, జీత్యా తండాలపై దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే ఆరోపణలతో ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

 

అయితే, కానిస్టేబుల్ హరి.. డ్రైవర్‌ను కాదని తానే ఆటో నడిపేందుకు పూనుకున్నాడు. చీమలపాడు-మాణిక్యారం గ్రామాల మధ్య ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ హరితోపాటు ఆరుగురు మహిళలు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కేలోత్ రామ్ని పరిస్థితి విషమంగా ఉంది. అందరినీ కారేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ నిర్లక్ష్యమే తమ ప్రాణాల మీదికి తెచ్చిందని బాధితులు ఆరోపిస్తున్నారు. 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top