రైలు ఢీకొని 50 గొర్రెల మృతి
కామారెడ్డి : కామారెడ్డి రూరల్ మండలం అడ్లూర్ వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని సుమారు 50 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల కాపరి సాయిలుకు కూడా గాయాలయ్యాయి. గొర్రెల మృతితో సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లినట్లు యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు.