అమ్మోనియం గ్యాస్‌ లీక్‌: 50 మందికి అస్వస్థత


తూర్పుగోదావరి: తూర్పుగోదారి జిల్లాలోని పెద్దాపురం నెక్కంటి సీఫుడ్స్‌లో అమ్మోనియం గ్యాస్‌ లీకైంది. ఈ ఘటనలో 50 మంది అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం కాకినాడ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.



ఈ ఘటనపై స్పందించిన హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎస్పీ రవిప్రకాశ్‌ బాధితులను పరామర్శించినట్టు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top