కరీంనగర్లో పసికందు కిడ్నాప్
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని బొమ్మకల్ శివారులోని చల్మెడ ఆనందరావు ఆస్పత్రిలో పసికందు మాయమైంది. చామనపల్లికి చెందిన రమ్య- ప్రవీణ్ దంపతులకు ఐదు రోజుల క్రితం మగ శిశువు జన్మించాడు. కాగా, రాత్రి నుంచి పసికందు కనిపించకపోవడంతో వారు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారనే కోణంలో పోలీసులు సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఫుటేజీ ఆధారంగా అనుమానితుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. కిడ్నాపర్లను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు కమిషనర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. కిడ్నాప్కు సంబంధించి సమాచారమిచ్చిన వారికి తగిన పారితోషకాన్ని ఆయన ప్రకటించారు.