హోదా.. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష: పిన్నెల్లి

హోదా.. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష: పిన్నెల్లి - Sakshi

ప్రత్యేక హోదా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అని వైఎస్ఆర్‌సీపీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రతిపక్షంగా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత తమపై ఉందని, అయితే అసెంబ్లీలో తమ గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం ఎంతవరమైనా పోరాడతాం తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ ప్రివిలేజి కమిటీ ఎదుట శుక్రవారం హాజరైన ఆయన.. తన వివరణ ఇచ్చారు. 

 

వ్యక్తిగత కారణాల వల్ల తాము హాజరు కాలేకపోతున్నామని మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని), చెవిరెడ్డి భాస్కరరెడ్డి లేఖలు రాశారు. ఇప్పటికే 9 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు విచారణ కమిటీ ఎదుట హాజరై తమ వివరణ ఇచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ గత అసెంబ్లీ సమావేశాలలో వైఎస్ఆర్‌సీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. దీనిపై అసెంబ్లీలో ఆందోళనకు దిగినందుకు విపక్ష ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top