విరిగిపడిన చెట్టు: 40 మందికి గాయాలు


జి.మాడుగుల : విశాఖపట‍్టణం జిల్లా జి.మాడుగులలో పాఠశాల భవనంపై మంగళవారం మధ్యాహ‍్నం ఒక చెట్టు విరిగిపడింది. ఈ ఘటనలో సుమారు 40 మంది ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని జి. మాడుగుల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనంలో ఉపాధ్యాయులందరూ సమావేశమై ఉన‍్నప్పుడు భవనం పక‍్కనున‍్న చెట్టు ఒక‍్కసారిగా భవనంపై కుప‍్పకూలింది. దాంతో సమావేశంలో పాల‍్గొన‍్న ఉపాధ్యాయుల‍్లో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top