రోడ్డు ప్రమాదం: నలుగురికి గాయాలు


కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం రామవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. కొత్తగూడెం వైపు విద్యార్థులతో వెళ్తున్న ఓ ఆటో ముందు చక్రం ఊడిపోవడంతో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరిలో మట్టపర్తి అక్షయ(6) అనే చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదసమయంలో ఆటోలో 9 మంది ఉన్నారు. 

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top