బాయిలర్ పేలుడు: నలుగురికి గాయాలు
దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడిపల్లి వద్ద నున్న ఇండియా సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ బాయిలర్ పేలి నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.