లారీ బీభత్సం: నలుగురి మృతి


జీకేవీధి: విశాఖపట్నం జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న దుకాణాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని జీకేవీధి మండలం ఆర్వీనగర్‌ సమీపంలో ఓ లారీ అదుపుతప్పి షాపుల్లోకి వెళ్లింది. క్షతగాత్రులను స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top