కృష్ణానదిలో ముగ్గురు మహిళల మృతదేహాలు


ఇటిక్యాల: కృష్ణానదిలో ముగ్గురు మహిళల మృతదేహాలు కొట్టుకొచ్చిన సంఘటన కలకలం రేపింది. గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని బీచుపల్లి సమీపంలో గురువారం ఉదయం కృష్ణానదిలో మహిళల మృతదేహాలు తేలియాడటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ మృతదేహాలు స్థానిక మహిళలవా, లేక ఎగువ ప్రాంతాలకు చెందిన వారివా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top