గ్రానైట్ క్వారీలో ప్రమాదం
- ముగ్గురికి తీవ్ర గాయాలు
కేసముద్రం: గ్రానైట్ క్వారీలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లి శివారులోని ఓ గ్రానైట్ క్వారీలో శనివారం చోటు చేసుకుంది. క్వారీలో రాళ్లు కూలి ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.